పల్లవి
యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది
1వ చరణం
మహా సీయోను గుమ్మములు అవి యెహోవాకు నతిప్రియములు ఇఁక నిహ జను లెల్లరు గొనియాడి నిను బహు కీర్తంతురు పట్టణమా ||యెహోవ పురి||
2వ చరణం
భూమిలో సర్వజనాంగముల్ తమ నామము లచ్చట వ్రాయన్ ఆ స్వామి యెహోవా వారిన్ అట జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవ పురి||
3వ చరణం
పాటలు పాడి జనాంగమా తమ యూటలు నీ కడ గలవే యని స్తుతియింతురు నిను స్తుతిపాత్రా యిఁక భజియింతురు నిను నిజభక్తిన్ ||యెహోవ పురి||
4వ చరణం
ఇది క్రైస్తవ సంఘంబే కడు శుభముల నిచ్చు స్థలంబే ధర బుధు లేసుని నిటఁ గనుచు నతి ముదమును బొందుట నిజమే ||యెహోవ పురి||
5వ చరణం
జనః కుమా రాత్మకును నిఁక ఘనమహిమలు గల్గునుగాక ఆ దిని నుండిన రీతిని నిపుడు నిఁక ననవరతముండును ఆమేన్ ||యెహోవ పురి||