పల్లవి
మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ మహిమ||
1వ చరణం
శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ మహిమ||
2వ చరణం
వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు ||మహిమ మహిమ||
3వ చరణం
తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి ||మహిమ మహిమ||